అల్లు అర్జున్ మైండ్ ప్రెసెన్స్ సంగతే వేరు.మంచి దర్శకులతో పాటు మినిమమ్ గ్యారంటి కథలతో రావడమే కాదు, వేసవి సెలవుల్ని వదలకుండా తన సినిమాలని రిలీజ్ చేస్తుంటాడు మన స్టయిలీష్ స్టార్.
ఇప్పుడు మహేష్ బాబు బాటలో తమిళ మార్కేట్ వైపుకి అడుగులేస్తున్న అల్లు అర్జున్, మహేష్ కంటే తెలివిగా అలోచించి ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు.
మహేష్ బాబు – మురుగదాస్, అల్లు అర్జున్ – లింగుస్వామి .రెండూ ద్విభాష చిత్రాలే.మురుగదాస్, లింగుసామి .ఇద్దరు పెద్ద దర్శకులే.ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, రకుల్ ప్రీత్ తమిళ జనాలకి పెద్దగా తెలిసిన పేరు కాదు.
కాని మహేష్ చేసిన తప్పు బన్ని చేయట్లేదు.తమిళనాట క్రేజ్ ఉన్న కథానాయికనే ప్రాజెక్టులోకి తీసుకుంటున్నాడు.
ఆ భామ ఎవరో కాదు.కీర్తి సురేష్.
ప్రస్తుతం నయనతార తరువాత తమిళనాడులో అత్యధిక డిమాండ్ కలిగిన హీరోయిన్ తను.అల్లు అర్జున్ తెలుగు – తమిళ ద్విభాష చిత్రానికే కీర్తినే హీరోయిన్ గా అనుకుంటున్నారట.ఇదే నిజమైతే బన్ని సినిమాకి తమిళనాడులో మంచి డిమాండ్ ఏర్పడటం ఖాయం.స్టుడియో గ్రీన్ నిర్మించబోయే ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తారు.