మళయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పుడు దక్షిణాదిలో ఒక సంచలనం.ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో ఏకకాలంలో సూపర్ హిట్ చిత్రాలు అందుకోని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ.
తమిళంలో విజయ్ లాంటి అగ్రహీరో సరసన అవకాశమైతే కొట్టేసింది కాని, తెలుగులో రెండు పెద్ద అవకాశాలు పోగొట్టుకుంది కీర్తి.
మొదటిది రామ్ చరణ్ – సురేందర్ రెడ్డిలా తని ఒరువన్ రీమేక్ కాగా, మరొకటి సూపర్ స్టార్ మహేష్ – మురుగదాస్ సినిమా.
ఈ రెండు చిత్రాల్లోనూ మొదట కీర్తినే కథానాయిక అన్నారు.రామ్ చరణ్ సినిమాలోకి రకుల్ ప్రీత్ వచ్చేస్తే, ఇప్పుడు మహేష్ సినిమాలోకి పరిణీతి చోప్రా వచ్చినట్లు చెబుతున్నారు.
అయితే ఈ అవకాశాలు పోవడానికి సినీ విశ్లేషకులు ఒక కారణం చేబుతున్నారు.అది ఎక్స్పోజింగ్ చేయకపోవడం.కీర్తి గ్లామరస్ గా కనిపించడానికి ఒప్పుకోవట్లేదట.కనీసం పాటల్లో అయినా, కాస్త పొదుపుగా బట్టలు వేసుకోకపోతే ఈకాలంలో కష్టమే కదా.అందుకే కమర్షియల్ సినిమాలు తీయాలనుకునేవారు కీర్తి మీద మక్కువ చూపించట్లేదట.