మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులు మధ్య కోల్డ్వార్ నడుస్తోందని, తొలి నుంచి తెరాసాలో ఉన్న పద్మారావుకు మద్దతుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తలసాని తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని విశ్వసనీయ వరా్గల తాజా కథనం .ఇటీవలే తలసానిని కమర్షియల్ టాక్స్ శాఖ నుంచి తప్పించిన కేసీఆర్ అవసరమైతే మం్రతి వర్గంనుంచి తీసేందసందుకు ఒకానొకదశలో సిద్దమైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఆదేశాలమేరకే తను సనత్ నగర్ నుంచి పోటీ చేసాను మినహా తన వరకు సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్దంగా లేనని, ఎవరికే సమస్యల వచ్చినా తనని కలవాలంటూ తలసాని ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో చెప్పారు.
తన నియోజక వర్గంలో తలసాని పదే పదే వేలు పెడుతూ తనకి ఇబ్బంది కర వాతావరణం సృస్టి స్తున్నాడంటూ పద్మారావు, పలు ఆరోపణలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లటం, వీటిపై తనదైన శైలిలో నిర్ధారించుకున్నట్ల కనిపిస్తోంది.
తదుపరి తలసాని బాధ్యతల తప్పించే కార్యక్రమం జరిగినా నేటికీ ఆతని ప్రవర్తలో మార్పురాలేదంటూ పద్మారావు గుర్రుగా ఉన్నట్టు తెలస్తోంది.దీనికి తోడుగా సికింద్రాబాద్ జిల్లా బాధ్యతలు తన కివ్వాలంటూ తలసాని కోరికను మన్నించొద్దని మంత్రులు నాయని, ఆలీలు కూడా కేసీఆర్కు విన్నవించడంతో ఈ బాధ్యత పద్మారావుకే దక్కనున్నట్టు పార్టీ వర్గాలల గుసగుస వినిపిస్తోంది.
కొత్త జిల్లాలల ఏర్పాటు తదుపరి మరోమారు మంత్రి వర్గ విస్తరణ జరపాలని భావిస్తున్న కేసీఆర్ తలసాని బదులుగా తీగల కృష్ణారెడ్డిని లేదా మాధవరం ను మంత్రివర్గంలోకి తీసుకునే యోచన చేస్తున్నట్టు సమాచారం.మరి ఏం కానుందో చూడాలి మరి.