పార్టీలు మారుతున్న నాయకులు, నేతలు పుణ్యమా అంటూ.ఏ నేత ఏ పార్టీలో ఎప్పటివరకూ ఉంటాడో తెలీదు.
అయితే ఈమధ్యనే ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో రోజు రోజుకూ మారుతున్న పరిణామాలు చూస్తుంటే.మళ్లీ అలనాటి అన్నగారి మంత్రివర్గం గుర్తొస్తుంది.
విషయం ఏమిటంటే.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎందరికో రాజకేయ బిక్ష పెట్టింది.
అయితే ఆ పార్టీ తరువాత తెలుగునేలలో ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది.ఇదిలా ఉంటే.
ఇప్పటి ముఖ్యమంత్రులు బాబు, కేసీఆర్ మొదలుకుని, తాజాగా టీడీపీని వదలి టీఆరఎస్ లో చేరిన తుమ్మల, కడియం ఇద్దరు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన క్రమం నుండి ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన వారే.అయితే సరిగా గమనిస్తే ఇక్కడ ఒక విషయం అర్ధం అవుతుంది.
తెలంగాంలో తెలుగుదేశాన్ని దెబ్బతీసి…అదే తెలుగుదేశం నేతలతో కేసీఆర్ తన క్యాబినెట్ ను ఏర్పరుచుకున్నాడు.అంటే ఇది తెలంగాణాలో తెలుగుదేశం క్యాబినెట్ అన్న మాట.