వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో గులాబీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.వరంగల్ను అన్ని విధాలా అబివృద్ధి చేస్తానని చెప్పారు.
వరంగల్ను స్మార్ట్ సిటీ చేయడానికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కాబట్టి దీన్ని స్మార్ట్ సిటీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు.గులాబీ పార్టీని గెలిపించినందుకు వరంగల్ ప్రజలకు మంచి బహుమానం దక్కబోతున్నది.
అనుకున్న విధంగా ఈ హామీ నెరవేరుస్తే వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు గ్యారంటీ.వరంగల్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి ప్రశంసల్లో ముంచెత్తారు.
ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెంచాలన్నారు.ఇప్పటివరకు కేసీఆర్కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం జరిగినా ప్రజలు నమ్మలేదని ఎన్నిక ఫలితం రుజువు చేసింది.