" కెసిఆర్ - హరీష్ రావు ఆంధ్రా వాళ్ళతో కుమ్మక్కు అయ్యారు "

తెలంగాణా లో టీడీపీ కి ఉన్న ఒకే ఒక్క ఆశా కిరణం రేవంత్ రెడ్డి.తెరాస పార్టీ నీ కెసిఆర్ నీ ఏకడం అంటే ఆయనకీ ఆయనే సాటి అని చెప్పాలి.

 Kcr And Harish Rao Doing Wrong For People-TeluguStop.com

హరీష్ రావు – కెసిఆర్ ల మీద ఆయన ప్రస్తుతం విరుచుకుని పడుతున్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ కెసిఆర్ మీద కోపంగా ఉన్న సమయం లో రేవంత్ రెడ్డి ఈ అంశం మీద దీక్ష చెయ్యడానికి గజ్వేల్ నియోజికవర్గానికి వెళ్లారు.

అక్కడ కి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ” హరీష్ రావు – కెసిఆర్ లు ఇద్దరూ తమ తమ జేబులు నింపుకోవడం కోసం మాత్రమె ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు .ఆంధ్రా కాంట్రాక్టర్ లతో కుమ్మక్కు అయిన అల్లుడూ మామా ఇద్దరూ అక్రమ సంపాదన కి అలవాటు పడ్డారు .ప్రాజెక్ట్ నిర్మానానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నా.మంత్రి హరీశ్ మాత్రం అక్కడి రైతుల్ని బెదిరించడం చాలా బాధాకరమైన విషయం ” అన్నారు రేవంత్.

” ఉద్యమాలు చేసింది ఒకరూ , అధికారం వెలగబెడుతోంది మరొకరు ” అంటూ రేవంత్ కెసిఆర్ ని దెప్పి పొడిచారు.దాదాపు నాలుగు వేల గ్రామాలు ఈ ప్రాజెక్ట్ వలన రూపు లేకుండా పోతాయి అనీ అలాంటి ప్రాజెక్ట్ ఎవరు మాత్రం కోరుకుంటారు అనీ రేవంత్ మండి పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube