తెలంగాణా లో టీడీపీ కి ఉన్న ఒకే ఒక్క ఆశా కిరణం రేవంత్ రెడ్డి.తెరాస పార్టీ నీ కెసిఆర్ నీ ఏకడం అంటే ఆయనకీ ఆయనే సాటి అని చెప్పాలి.
హరీష్ రావు – కెసిఆర్ ల మీద ఆయన ప్రస్తుతం విరుచుకుని పడుతున్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ కెసిఆర్ మీద కోపంగా ఉన్న సమయం లో రేవంత్ రెడ్డి ఈ అంశం మీద దీక్ష చెయ్యడానికి గజ్వేల్ నియోజికవర్గానికి వెళ్లారు.
అక్కడ కి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ” హరీష్ రావు – కెసిఆర్ లు ఇద్దరూ తమ తమ జేబులు నింపుకోవడం కోసం మాత్రమె ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు .ఆంధ్రా కాంట్రాక్టర్ లతో కుమ్మక్కు అయిన అల్లుడూ మామా ఇద్దరూ అక్రమ సంపాదన కి అలవాటు పడ్డారు .ప్రాజెక్ట్ నిర్మానానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నా.మంత్రి హరీశ్ మాత్రం అక్కడి రైతుల్ని బెదిరించడం చాలా బాధాకరమైన విషయం ” అన్నారు రేవంత్.
” ఉద్యమాలు చేసింది ఒకరూ , అధికారం వెలగబెడుతోంది మరొకరు ” అంటూ రేవంత్ కెసిఆర్ ని దెప్పి పొడిచారు.దాదాపు నాలుగు వేల గ్రామాలు ఈ ప్రాజెక్ట్ వలన రూపు లేకుండా పోతాయి అనీ అలాంటి ప్రాజెక్ట్ ఎవరు మాత్రం కోరుకుంటారు అనీ రేవంత్ మండి పడ్డారు.