తెలంగాణా ముఖ్యమంత్రి గురించి ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఎప్పుడూ ఆసక్తిగా చెబుతూ ఉంటారు.ఆయన వ్యవహార శైలి, లీడర్ షిప్ క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు ఆమె చక్కగా వివరిస్తారు కూడా.
అమెరికా లో ప్రస్తుతం ఆటాసంబరాల్లో బిజీ గా ఉన్న ఆమె అందరితో తన భావాలు పంచుకుంటూ ” ఆరోగ్య కారణాల వలన ” కెసిఆర్ అమెరికాకి రాలేదు అని అందుకే ఆయన బదులుగా తాను వచ్చాను అనీ లేదంటే ఆయన వచ్చారు అని చెప్పాడా ఆసక్తికరంగా మారింది.అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) స్వర్ణోత్సవాలు – అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా తెలంగాణ) సంబరాల నేపథ్యంలో కవిత అమెరికా వెళ్లారు.
ఈ సందర్భంగా తనతల్లిని కూడా వెంటబెట్టుకువెళ్లారు.అయితే ఈ రెండు వేదికల్లో కవిత మాత్రమే హాజరయ్యారు.
కేసీఆర్ సతీమణి వెళ్లలేదు.దీంతో పలువురు సీఎం సతీమణి శోభ గైర్హాజరి గురించి ఆరాతీశారు.
ఒక్కొక్కరికీ చెప్పేబదులుగా వేదిక మీదనుంచే కవిత క్లారిటీ ఇచ్చారు.
తన తల్లికి లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం ఇష్టమని అందుకే ఆమె వేడుకలకు రాలేదని చెప్పారు.
తన ఒత్తిడి మేరకు అమెరికా వచ్చారని తెలిపారు.ఇక కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా జరుగుతున్న చర్చ తనకు తెలుసని కవిత వ్యాఖ్యానించారు.