విజువల్ వండర్ బాహుబలి 2 సినిమా విడుదలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తాజాగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది.కావేరీ జల వివాదానికి సంబంధించి కొద్ది కాలం కిందట సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంతో కథ సుఖాంతమైంది.
వాస్తవానికి ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బాహుబలి2 సినిమాను విడుదల చేయనీయం అంటూ కన్నడ నాట కొన్ని సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.దీంతో దర్శక నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు.
ఆఖరికి నేను కన్నడిగులకు వ్యతిరేకం కాను.కానీ తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడు తూనే ఉంటానని అన్నారాయన.
అంతేకాదు రాజమౌళి సైతం ఓ వీడియో ద్వారా కన్నడిగులకు క్షమాపణ చెప్పారు.ఇక ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ తో సహా అన్ని పనులూ పూర్తయ్యాయి.
ప్రచార పనులను సైతం చిత్ర యూనిట్ వేగవంతం చేస్తోంది.ముఖ్యంగా విజువల్స్ కి సంబంధించి చిత్ర బృందం తీసుకున్న శ్రద్ధ, యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం గురించి చిత్ర సాంకేతిక బృందంలో ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి వివరిస్తుండడంతో సినిమాపై మరింత ఆసక్తి రేగుతోంది.
సెంథిల్ , కమల్ కణ్ణన్ లాంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్లు సినిమాకో బిగ్ ఎస్సెట్ గా నిలిచారు.మొత్తంగా ప్రముఖ వీఎఫ్ ఎక్స్ స్టూడియోలూ ఈ సినిమాకు పనిచేశాయి.
అలానే మరికొన్ని ఫార్మెట్స్లో కూడా బాహుబలి కథని జనాలకు పరిచయం చేసేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోంది.గేమ్ కల్చర్, డిజిటల్ బుక్ ఇలా ఒక్కటేంటి అన్ని రూపాల్లోనూ బాహుబలి కథను వివిథ మాథ్యమాల ద్వారా చెప్పేందుకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు మరింతగా ఆకట్టుకునేందుకు ఆర్కా మీడియా బృందం ప్రణాళికలు రూపొందిస్తోంది.
అలానే బాహుబలి సినిమాకు సంబంధించి లీకేజీ సమస్య అన్నదే లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని వీఎఫ్ఎక్స్ అబ్జర్వర్ కమల్ కణ్ణన్ చెబుతున్నారు.జపాన్ లో ఓ సర్వర్లో తాము చిత్రీంచిన దృశ్యాలను దాచామని, ఎవరు వాటిని తీసుకుని సాంకేతిక హంగులు అద్దాలన్నా అదేమంత సులువు కాదని స్పష్టంచేశారు.
ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు తెల్సుకోవాలంటే మీరూ మేమూ మరికొద్ది కాలం ఆగాల్సిందే!! ఈలోగా కట్టప్ప అక్కడా ఇక్కడా మీడియా ఎదుట చెబుతున్న కథలను వినాల్సిందే!!
.