గత కొంత కాలంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాలు బాలీవుడ్కు వెళ్తున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు ఎన్నో సౌత్ సినిమాలు బాలీవుడ్కు వెళ్లి, రీమేక్ అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అందులో పలు రీమేక్ చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించినవి.తాజాగా అదే దారిలో మంచు లక్ష్మి నటించి నిర్మించిన ‘దొంగాట’ చిత్రం కూడా బాలీవుడ్కు వెళ్లబోతుంది.
ఒక సింపుల్ స్టోరీ లైన్తో సస్పెన్స్, థ్రిల్లర్ స్క్రీన్ప్లేతో ‘దొంగాట’ చిత్రాన్ని వంశీ కృష్ణ తెరకెక్కించాడు.చిన్న చిత్రంగా తెరకెక్కిన ‘దొంగాట’ మంచు లక్ష్మికి లాభాల పంట పండేలా చేసింది.
ఇప్పుడు ఇదే కథాంశంతో దర్శకుడు వంశీ కృష్ణ బాలీవుడ్లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.ఈ రీమేక్లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ నటించేందుకు ఓకే చెప్పిందని, బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులతో త్వరలోనే రీమేక్కు వంశీ కృష్ణ రంగం సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘దొంగాట’ బాలీవుడ్లో మెప్పిస్తుందో చూడాలి.