కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటారు.ఎదో ఒక విషయం లో ఆయన మీడియా లో నానుతూ ఎవరో ఒకళ్ళతో తిట్లు తింటూ లేదా తిడుతూ ఉంటారు.
అలాంటి రామయ్య ఇప్పుడు కొత్త వివాదం లో ఇరుక్కున్నారు.సీఎం ప్రతిష్ట ఈ మధ్య కాలం లో తీవ్రంగా దెబ్బతింటోంది.
దీని అంతటికీ కారణం ఒక మంత్రగాడి శాపం అంటున్నారు చాలా మంది.ముఖ్యంగా ఆయన అనుచర గళం అందరూ ఇదే విషయం నమ్ముతున్నారు.
కర్ణాటకలోని కొల్లెగల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొద్ది కాలం క్రితం సిద్ధరామయ్యను కలిశాడట.తాను మంత్రించి తెచ్చిన వస్రాన్ని తీసుకోవాలని కోరాడట.
తనకు అలాంటి నమ్మకాలు లేవని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారట.దీంతో ఆ మాంత్రికుడు తన కుటుంబం కష్టాల్లో ఉందని – భార్యకు అనారోగ్యమని – ఆదుకోవాలని కోరాడట.
అందుకు సీఎం ఆగ్రహించి ఇలా అబద్ధాలు చెప్పి బతికేవారు ఎక్కువైపోయారంటూ మండిపడ్డారట.దీంతో ఆ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి సీఎంను శపించినట్టు అనుచరులు చెబుతున్నారు.