మొదటి సినిమా మిర్చిలాంటి కుర్రాడు సినిమా ఎవరికి తెలియకపోయినా కంచెతో తన ప్రతిభ కనబరచి ఆడియెన్స్ లో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్.కంచె సినిమాలో వరుణ్ తేజ్ పక్కన జమిందారి కుటుంబ యువరాణి పాత్రలో ప్రగ్యా జైశ్వాల్ అదరగొట్టింది.
ఇక ఆ సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఈ భామ ఇప్పుడు ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతున్న రాఘవేంద్ర రావు, నాగార్జున ఓం నమో వెంకటేశాయలో నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా అసలైతే మంచు మనోజ్ సినిమాలో నటించాల్సి ఉంది.
మరి ఏమైందో ఏమో కాని ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమా నుండి తప్పుకుందని ఫిల్మ్ నగర్ టాక్.సత్య డైరక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో ప్రగ్యా ఓకే అని చెప్పినా డేట్స్ అడ్జెస్ట్ అయ్యే పరిస్థితి కనబడటం లేదట.
అందుకే మనోజ్ సినిమా నుండి వాకవుట్ చేసిందని అంటున్నారు.అయితే కారణం అదేనా ఫ్లాపుల్లో ఉన్న మంచు బాబు సినిమాలో చేసిన అంత ఉపయోగం ఉడదు అని హ్యాండిచ్చిందా అంటూ గుసగుసలాడుతున్నారు.
సో ఏది ఏమైనా మనోజ్ సినిమాలో ప్రగ్యా చూసి ఆనందిద్దాం అనుకున్న ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే అయ్యింది.