ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, శాఖల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయం, అవమానంపై చంద్రబాబు సొంత సామాజికవర్గమైన కమ్మ కులం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంది.ఆ కులం నుంచి చాలా మంది సీనియర్లు మంత్రి పదవి ఆశించినా చంద్రబాబు వారందరిని పక్కనపెట్టి తన కుమారుడికి మంచి శాఖలు ఇచ్చుకోవడం చాలా మంది సీనియర్లకు నచ్చలేదు.
ఇది ఇలా ఉంటే ప్రక్షాళనలో ఆ వర్గానికి చెందిన ప్రత్తిపాటి, పరిటాలకు ప్రయారిటీ తగ్గించడం కూడా చాలామందికి మింగుడు పడడం లేదు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్, అలక వహించిన ధూళిపాళ్ల, అసంతృప్తితో ఉన్నపయ్యావుల కేశవ్ తదితరులంతా అదే సామాజికవర్గం కావడం ప్రస్తావనార్హం.
మిగిలిన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా వారెవరూ రోడ్డెక్కలేదు.ఇదే అంశంపై నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కొద్ది రోజుల క్రితమే అసంతృప్తి గళం విప్పారు.
చంద్రబాబుకు కమ్మ కులానికి ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత కోస్తా, అనంతపురం జిల్లాలకు చెందిన కమ్మ వర్గ నేతలు బాబు-లోకేష్ కలసి తీసుకున్న నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు.
పదేళ్లు ప్రతిపక్షంలో సర్వం నష్టంపోయిన తమకు ఇంత అన్యాయం జరుగుతుందని భావించలేదని వారు రగిలిపోతున్నారు.బాబు-లోకేష్ చుట్టూ భజనపరులు, పారిశ్రామికవేత్తలు, అధికారులైన కొందరు కమ్మ వారికే తప్ప, క్షేత్రస్థాయిలో జెండా మోసిన వారికి గుర్తింపు దక్కలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, వెలగపూడి రామకృష్ణబాబు వంటి నేతలు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు.రెడ్లకు, కాపులకు కీలకమైన పదవులు ఇచ్చిన బాబు కమ్మ వర్గం మంత్రులకు పెద్ద షాకే ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిటాల సునీతకు పౌరసరఫరాల శాఖ తప్పించి ప్రాధాన్యం లేని మహిళా సాధికారికత, శిశు సంక్షేమం, వృద్ధుల సంక్షేమం – ప్రత్తిపాటి పుల్లారావును వ్యవసాయశాఖ నుంచి తప్పించి ధరల నియంత్రణ వంటి శాఖలివ్వడంపై పెదవి విరుపు వినిపిస్తోంది.ఇక సీనియర్లను పక్కన పెట్టి లోకేశ్కు మంత్రి పదవి.
అది కూడా కీలక శాఖలు ఇచ్చారు.ఏదేమైనా చంద్రబాబుపై పార్టీలో కమ్మ వర్గం గుస్సాగా ఉంది.
ఇది పెద్ద అగ్నిలా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి.