ఇజం కథ అలా ఉండదంట

ఈమధ్యకాలంలో చూస్తే, పూరి జగన్నాథ్ తన సినిమాల్లో ఏదో ఓ సామాజిక అంశాన్ని లేవదీస్తున్నారు.బిజినెస్ మెన్ లో క్రైమ్ రేట్ తగ్గించేస్తే, కెమెరామెన్ గంగతో రాంబాబులో విభజన రాజకీయాలపై అస్త్రాన్ని సంధించారు.

 Kalyan Ram Clarifies On Ism Story Rumours-TeluguStop.com

టెంపర్ లో రేప్ దోషులపై దండయాత్ర, జ్యోతిలక్ష్మీలో ఓ వేశ్య పోరాటం .ఇలా పూరి ప్రతి సినిమాలో ఒక సోషల్ టాపిక్ తో వస్తున్నారు.అదే బాటలో ఇజం సినిమా కోసం ఆమధ్య సంచలనంగా నిలిచిన పనామా పేపర్స్ వివాదాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారని వార్తలొచ్చాయి.

జర్నలిజంపై సెటైర్లు ఉంటాయని, కళ్యాణ్ రామ్ పనామా పేపర్స్ అక్రమాలపై పోరాటం చేస్తారని, ఇదే ఈ చిత్రం యొక్క కథ అని ఊహాగానాలు వినిపించాయి.

కాని అవన్ని రూమర్స్ అని కళ్యాణ్ రామ్ కొట్టిపారేశారు.పనామా పేపర్స్ వివాదానికి ముందే ఈ కథ ఫైనలైజ్ అయ్యిందని, ఆ బ్లాక్ మని వివాదంపై ఈ సినిమా కథ ఆధారపడిలేదని కళ్యాణ్ రామ్ ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.

అలాగే సాయిధరమ్ తేజ్ తో సినిమాకి ఇంకా కథ సిద్ధం కాలేదని, టైటిల్ “రామకృష్ణ” కాదని స్పష్టీకరించారు కళ్యాణ్ రామ్.

ఇక ఇజం విషయానికి వస్తే, ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మాజీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది.

ఆక్టోబర్ 21వ తేదిన ఈ చిత్రం విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube