యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో హీరో అభిమానులకు కావాల్సిన అన్ని హంగులు, ఆర్భాటాలు ఏరికోరి సమకూరుస్తున్నారు డైరక్టర్ కొరటాల శివ.అందుకే ఐటమ్ సాంగ్ కోసం మోడల్స్ ని, ఐటమ్ బాంబులని కాకుండా, తెలుగు తెరను ఏలుతున్న టాప్ హీరోయిన్లలో ఒకరితో చిందులేయించాలని ముందే ఫిక్స్ అయిపోయారు కొరటాల.
ముందు తమన్నాని అనుకున్నారు.అయితే తమన్నా ఇప్పటికే రెండు ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది.తమన్నా చేస్తే కొత్తగా ఏముంటుంది, ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ జోలికే పోని హీరోయిన్ తో చేయిస్తే కదా మాస్ జనాలకి కిక్కు అని గ్రహించిన కొరటాల శివ ఇప్పుడు అందాల భామ కాజల్ ని రంగంలోకి దింపుతున్నారు.
జనతా గ్యారేజ్ ఐటమ్ సాంగ్ లో యంగ్ టైగర్ తో కలిసి చిందులేసేది తమన్నా కాదు, కాజల్ అగర్వాల్.
మిల్కి బ్యూటి ఛాన్స్ తన బుట్టలో వేసుకుంది కాజల్.ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో ఈ ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారు.
నిజానికి ఆ సమయంలో కేరళ షెడ్యూలు ప్లాన్ చేసింది యూనిట్.కాని కాజల్ కోసమని షెడ్యూలులో మార్పులు చేసారు.
ఇక మరో వార్త ఏంటంటే, జనతా గ్యారేజ్ మ్యూజిక్ రైట్స్ ని లహరి మ్యూజిక్ కొనుగోలు చేసింది.ఎంత పెట్టి కొన్నారు అనేది బయటపడలేదు కాని, దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలను ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.