చూస్తుండగానే కాజల్ 30 ల్లోకి అడుగుపెట్టింది.అప్పుడే కాజల్ మన మనసుల్ని దోచుకోని పదేళ్ళు అవుతున్నాయి మరి.
తేజ తీసిన లక్ష్మి కల్యాణంతో పరిచయమైన ఈ అందం, ఇప్పుడు మళ్ళీ అదే తేజ తీసిన నేనే రాజు నేనే మంత్రితో మరోసారు ప్రేక్షకులని అలరించడానికి వస్తోంది.ఇందులో రానా దగ్గుబాటి కథానాయకుడు.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా సేల్ఫీష్ పొలిటిషియన్ గా రానా కనిపించానున్నాడని తెలుస్తోంది.అయితే బయటి ప్రపంచానికి ఈ రాజు ఎలా ఉన్నా, తన రాణికి మాత్రం మంచి భర్త.
నేనే రాజు నేనే మంత్రి ప్రోమోలు చూస్తోంటేనే అర్థం అవుతోంది, రానా – కాజల్ ల మధ్య ప్రేమ సన్నివేశాలని తేజ ఎంత బాగా తీసారో.కాజల్ రానా మధ్య మంచి కెమిస్ట్రీ కనబడుతోంది.
ఇద్దరు ఇప్పుడు మంచి స్నేహితులు కూడా.
మరి ఈ సినిమా హీరో హీరోయిన్ ని అంత ప్రేమగా చూసుకుంటాడు కదా, అలాంటి భర్త మీకు వస్తే ఎలా ఫీల్ అవుతారు అంటే, అలాంటి భర్త అస్సలు వద్దు అంటోంది కాజల్.
రానా పోషించిన జోగేంద్ర పాత్ర ఒక రాజకీయ నాయకుడి పాత్ర అని, నిజజీవితంలో పోలిటీషియన్ ని పెళ్ళి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదని చెబుతోంది కాజల్.అలాగే తానూ రాధ లాగా నిజజీవితంలో ఉండలేను అని కూడా ఒప్పుకుంది.
మరి కాజల్ ఇలా అనేసింది అంటే సినిమాలో రానా పాత్రస్వభావం ఎన్నిరకాలుగా మారుతుందో.మరో విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో తన పాత్ర కంటే కాథెరిన్ పోషించిన పాత్ర కాజల్ కి ఎక్కువ ఇష్టం అంట.
రానా సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల కానుంది.విశేషం ఏమిటంటే, ఇదేరోజు బాక్సాఫీస్ వద్ద నేనే రాజు నేనే మంత్రితో మరో రెండు క్రేజీ సినిమాలు నితిన్ లై మరియు బోయపాటి తీసిన జయ జానకి నాయక విడుదల కానున్నాయి.