వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో గులాబీ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయం రేపు తేలిపోతుంది.గులాబీ అభ్యర్థిని గురువారం ప్రకటిస్తారట.
వరంగల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో అనేకమంది పేర్లు తెర మీదికి వచ్చాయి.వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి కూతురు డాక్టర్ కావ్య పేరు చాలా రోజులుగా వినిపిస్తోంది.
తన కూతురుకు టిక్కెటు ఇవ్వాలని శ్రీహరి ముఖ్యమంత్రిని అడిగారని మీడియాలో వార్తలు వచ్చాయి.చివరకు ఇప్పుడు ఆమె పోటీలో లేదని తేలిపోయింది.
తన కూతురు రేసులో లేదని శ్రీహరి స్పష్టం చేశారు.తన కూతురు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రాదని చెప్పారు.
సో ….ఈ కథ ముగిసింది.
ఇక అసలు అభ్యర్థి ఎవరో తేలాలి.నిజానికి అభ్యర్థిని నిర్ణయించడానికి అధికార పార్టీకి ఇంత సమయం పట్టకూడదు.
అందులోను పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు.ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉండాలి.
కాని ఆ పరిస్థితి లేదు.గెలుపు గురించి అధికార పార్టీ భయపడుతోంది.
అందుకే ఇంత జాప్యం జరిగింది.గులాబీ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని నాయకత్వం గుర్తించింది.
కాబట్టే బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేసింది.