యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ను వచ్చే నెలలో పూర్తి చేసేందుకు దర్శకుడు సుకుమార్ ఏర్పాట్లు పూర్తి చేశాడు.
అలాగే ఈ చిత్రానికి అదే సమయానికి సంగీతాన్ని కూడా పూర్తి చేయాలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ భావిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఒక పాటను ఎన్టీఆర్తో పాడిరచాలని దేవి శ్రీ ప్రసాద్ తాపత్రయ పడుతున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ కోరికను ఎన్టీఆర్ కాదనలేక తప్పకుండా ఈ సినిమా కోసం ఒక పాటను పాడుతాను అంటూ హామీ ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ గతంలో పలు చిత్రాల్లో పాటలు పాడిన విషయం తెల్సిందే.
మొదటగా ఈయన ‘కంత్రి’ చిత్రంలో పాట పాడాడు.ఆ తర్వాత ‘యమదొంగ’ మరియు ‘అదుర్స్’ చిత్రాల్లో ఈయన పాటలు పాడిన విషయం తెల్సిందే.
మళ్లీ ఈయనతో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం పాట పాడిస్తున్నాడు.సినిమాలో వచ్చే అతి ముఖ్యమైన సాంగ్ను ఎన్టీఆర్తో పాడిస్తున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వచ్చే నెల మూడవ వారంలో ఆడియోను విడుదల చేయాలని నిర్ణయించారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.