తమిళ ‘కత్తి’ రీమేక్ వార్తలు మరోసారి ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.తమిళనాట ‘కత్తి’ విడుదలై ఘన విజయం సాధించిన వెంటనే ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
రీమేక్ రైట్స్ను దక్కించుకున్న ఠాగూర్ మధు ఈ సినిమాను పవన్ కళ్యాణ్కు ప్రత్యేక షో వేసి మరీ చూపించాడు.అయితే ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయని, ఇక తాను ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి సినిమా చేయడం సరి కాదనే ఉద్దేశ్యంతో నో చెప్పాడు.
పవన్ నో చెప్పడంతో ‘కత్తి’ని డబ్బింగ్ చేసి విడుదల చేయాలని ఠాగూర్ మధు భావించాడు.అయితే ఈ సినిమాపై ఎన్టీఆర్ ఆసక్తి కనబర్చాడు.
దాంతో డబ్బింగ్ పనులు ఆపేశాడు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
ఆ తర్వాత ‘కత్తి’ రీమేక్లో నటించే అవకాశాలున్నాయి.ఇక ‘కత్తి’ తొగు రీమేక్కు తమిళ దర్శకుడు మురగదాస్ స్క్రిప్ట్ను సమకూర్చేందుకు ఓకే చెప్పాడు.
తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఆ స్క్రిప్ట్లో మార్పు చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నాడు.