పోటిలోపడి, పోటిలోనే ఉండిపోతున్నారు మొబైల్ నెట్వర్క్ దిగ్గజాలు.ఇక ఎయిర్ టెల్, జియో గొడవల గురించి చెప్పేదేముంది.
ఏదైతే ఏం, వినియోగదారులు మాత్రం లాభపడుతున్నారు.మరో నెల గడిస్తే జియో ఉచిత ఆఫర్ అంతమైపోతుంది.
దాంతో జియో కూడా అసలైన పోటికిలోకి దిగినట్టే.ఉచిత సర్వీసులు లేనప్పుడు కూడా జియో వెంట ఎంతమంది ఉంటారనేది ఇప్పుడు ఆకస్తికరం.
జియో, ఎయిర్ టెల్, రెండూ ఏప్రిల్ నుంచి కొత్త ఆఫర్స్ తో వస్తున్నాయి.
జియో ప్రైమ్ గురించి ఇప్పటికే చెప్పాం.99 చెల్లించి, ఒక సంవత్సరం జియో ప్రైమ్ ఉపయోగించుకోవచ్చు.ఇందులో స్పెషల్ ఆఫర్ ఖరీదు నెలకి 300 రూపాయలు.
రోజుకి 1 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో ప్రీమియం ఆప్స్ .ఇప్పుడు పొందుతున్న అన్ని సర్వీసులు 303 రూపాయలకి.
ఇక ఈ ఆఫర్ కి పోటిగా, ఏప్రిల్ లో కొత్త ఆఫర్స్ తీసుకొస్తోంది.మొదటగా, దేశంలో ఏ ప్రదేశానికి అయినా రోమింగ్ చార్జీలు పడవు.ఇక జియో 303 రూపాయల ప్లాన్ కి పోటిగా రెండు కొత్త ప్యాక్స్ వస్తాయి.ఒకటి 145 రూపాయలు, మరొకటి 349 రూపాయలు.
వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు కాని, 14-16 GB డేటా నెల మొత్తానికి అందించనుందట ఎయిర్ టెల్.ఒక్కరోజుకి 500 MB లిమిట్ ఉండవచ్చు.
కాల్స్ అన్ లిమిటెడ్ గా అంచించే అవకాశాలున్నాయి.
చూశారుగా ఈ ప్లాన్స్.
రేపటి నుంచే జియో ప్రైమ్ రిజిస్ట్రేషన్ మొదలు.మరి మీరు ఏయిర్ టెల్ వైపు ఉంటారో, జియో వైపు ఉంటారో నిర్ణయించుకోండి.