గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం ‘జిల్’.ఈ సినిమాను ‘మిర్చి’ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లు నిర్మించారు.
సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమాకు ముందు గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘జిల్’పై అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.
అందుకు తగ్గట్లే ఈ సినిమా ట్రైలర్ స్టైలిష్గా ఉండి ఆకట్టుకుంది.దాంతో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు.
నిర్మాతలు ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటుకు అమ్మేశారు.
నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు ఏకంగా ఆరు కోట్లకు కొనుగోలు చేయడంతోనే ఈ సినిమా స్థాయి ఏంటో అందరికి తెలిసి పోతుంది.
దిల్రాజు నమ్మకం పెట్టిన ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారు.ఈ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా నిర్మాతలకు 20 కోట్లు చేతిలో పడ్డట్లుగా తెలుస్తోంది.
ఇక శాటిలైట్ మరియు ఆడియో, ఆన్లైన్ రైట్స్ అదనం.ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ కేవలం 15 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది.
విడుదలకు ముందుగానే లాభాలు తెచ్చి పెట్టిన ‘జిల్’ విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.