మా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నిన్న వచ్చిన విషయం తెల్సిందే.మా ఎన్నికల్లో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ భారీ విజయాన్ని సాధించాడు.
ఫలితాల ప్రకటన తర్వాత రాజేంద్ర ప్రసాద్ జయసుధ మరియు మురళి మోహన్లపై మరియు జయసుధ ప్యానెల్ సభ్యులపై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశాడు.తనను అభిమన్యుడిలా చేసి, తన అంతు చూడాలని ప్రత్యర్థులు చూశారంటూ రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై జయసుధ తీవ్రంగా స్పందించింది.ఆయన వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం చెప్పారు.
మా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్కు అభినందనలు చెప్పిన జయసుధ మాట్లాడుతూ.ఎన్నికల తర్వాత మా అంతా కలిసి ఉండాలని మొదటి నుండి అంతా కోరుకున్నారు.
అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యక్తిగత విమర్శలు చేయడం విచారకరం.ఆయన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు అని జయసుధ అన్నారు.
ఆయన చేస్తున్న ఫన్నీ స్టేట్మెంట్స్ నవ్వు తెప్పించేవిగా ఉన్నాయంటూ జయసుధ చెప్పుకొచ్చారు.విమర్శలు మాని పేద కళాకారులకు సాయం చేయాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉందని జయసుధ చెప్పుకొచ్చింది.