పోలవరం పై సర్వే తెలుగు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు అలాంటి భారి ప్రాజెక్టును పక్కన పెట్టేసి చంద్రబాబు పక్కనే మరో పిచ్చి ప్రాజెక్టును నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని లోకసత్తా పార్టీ నేత జయప్రకాష్ విమర్శించారు.ఆయన మాట్లాడుతూ పోలవరం కేంద్రమే ఆఘమేఘాలపై నిర్మించాల్సి ఉంది .
అందుకు పొత్తు పార్టీ ఈ సరికే దండిగా నిధులు తీసుకు రావల్సింది.అలాగే రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు వెంటనే విడుదల చేయాల్సి ఉంది .ఇలా తాత్సారం చేసుకుంటూ పోతే ఎలా అని జెపి ప్రశ్నించారు .విభజన జరిగి చాల నెలలు గడుస్తున్నా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వక పోవడం అన్యాయం అని జెపి అన్నారు.