మెగా ఫ్యామిలీ కోటనుండి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ ఇప్పుడు సరైన బ్లాక్ బ్లాస్టర్ కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.తిక్క విన్నర్, నక్షత్రం సినిమాలు వరుసగా బాల్చీ తన్నేయడంతో సాయి ఇప్పుడు తన కొత్త సినిమా జవాన్పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
అందుకే ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని అనుకుంటున్నాడు సినీ వర్గాలు.బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
నిజానికి సెప్టేంబర్ లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
దీనికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని వార్తలు వస్తున్నాయి.దిల్ రాజుకు కొన్ని సీన్లు నచ్చకపోవడంతో ఆయన సలహా మేరకే ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం.
జవాన్ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షికార్లు కొడుతుంది.ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుందుని సాయిధరమ్ తో పాటు సరిసమానంగా ఉండే ఓ స్నేహితుడి పాత్ర ఈ కథలో ఉంటుందని ఆ క్యారెక్టర్ లో ఓ అప్ కమింగ్ హీరో నటిస్తున్నాడని సాయిధరమ్ అత్యంత సన్నిహితుడైన ఆ హీరో కెరీర్ కి ఈ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందని టాక్ నడుస్తుంది.
అంతేకాదు ఇంటర్వెల్ టైమ్ కి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఓ ట్విస్ట్ ఇస్తాడని చివరకు ఆ స్నేహితుడే హీరోకి విలన్ గా మారతాడని ఇదే జవాన్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని సినీ జనాలు అంటున్నారు.మరి ఈ కథలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏమి లేవు పైగా మన తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ఆదరించడంలో ముందే ఉంటారు.
మరి జవాన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో ? చూడాలి.