పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఓ వైపు అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయంగా ఒక్కో సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వెళుతున్నాడు.పవన్ వేస్తోన్న అడుగులను నిశితంగా గమనిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి రోజు రోజుకు ఆందోళన కూడా ఎక్కువుతోందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.
పవన్ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో జరిగిన సభల్లో రకరకాల అంశాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
ఏపీకి ప్రత్యేక హోదా – ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు – అనంతపురం కరువ సమస్య – చేనేత సమస్య ఇలా ఎప్పటి నుంచో ఆయా ప్రాంతాల్లో తిష్టవేసిన సమస్యలను తీర్చాలని బాధితుల పక్షాన పోరాడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ జనసేనతో పాటు తనకు సూపర్ మైలేజ్ వచ్చే ఓ అంశాన్ని లేవనెత్తుతున్నాడు.అదే పోలవరం నిర్వాసితుల సమస్య.
పోలవరం భూనిర్వాసితుల కోసం ఉద్యమానికి రెడీ అవుతున్నాడు పవన్.పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు సరైన పరిష్కారం లేదు.
వీరికి ప్రభుత్వం పూర్తిగా పునరావాసం కల్పించలేదు.ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటూ పోలవరం నిర్వాసిత గ్రామాలైన ఉద్దండరాయపాలెం – మూలలంక గ్రామాల రైతులు హైదరాబాద్లో పవన్ను కలిశారు.
ఈ సమస్యపై పోరాడతానని పవన్ సైతం వారికి హామీ ఇచ్చారు.
ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే తానే స్వయంగా మంత్రులతో మాట్లాడతానని… అప్పటకీ సమస్య పరిష్కారం కాకపోతే క్షేత్రస్థాయిలో పోరాడతానని పవన్ స్పష్టం చేశాడు.
ఏదేమైనా ఉద్దానం బాధితుల పక్షాన పవన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన వెంటనే ప్రభుత్వంలో ఎలాంటి కదలిక వచ్చిందో.ఇప్పుడు పోలవరం విషయంలో కూడా మరో తీవ్ర పోరాటానికి పవన్ రెడీ అయినట్టే కనిపిస్తోంది.
ఏదేమైనా సమస్య పరిష్కరించుకుంటే మూలలంకలో పర్యటిస్తానని పవన్ చెప్పడంతో ఏపీ ప్రభుత్వంలో గుబులు స్టార్ట్ అయ్యింది.