ఎన్టీఆర్ ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా ప్రిన్స్...???

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆడియో వేడుకకు ప్రిన్స్ మహేష్ బాబు గెస్ట్ గా వస్తున్నాడట.వేడుకను హైదరాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక‌పై నిర్వహిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

 Janatha Garage Audio Function Chief Guest Details-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ సినిమాకి ప్రిన్స్ రావటానికి కూడా ఒక కారణం ఉందట.మహేష్ బాబు పరాజయాల బాటలో ఉన్న సమయంలో కొరటాల శివ ‘శ్రీమంతుడు’ రూపంలో హిట్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’ సినిమాకి దర్శకుడు కొరటాల శివ కావటంతో ప్రిన్స్ రావటం ఫిక్స్ అయినట్టు సమాచారం.ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు.

కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా ఈ నెలలో కాకుండా సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు.ఈ వేదికపై మలయాళం పాటలను కూడా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకలో కొసమెరుపు ఏమిటంటే… ఈ సినిమాలో స్పెష‌ల్ డాన్స్ కంపోజ్ చేసిన శేఖ‌ర్ మాస్టర్ తన బృందంతో కలిసి డాన్స్ చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube