యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది.ఇప్పటికే ఫ్యాన్స్ అందరు టికెట్ల కోసం థియేటర్ల దగ్గర బారులు తీరారు.
సినిమా మీద భారీ అంచనాలే ఉండటంతో కచ్చితంగా తారక్ కెరియర్ లో ఇదో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొదటి రోజు టార్గెట్ 20 కోట్ల కలక్షన్స్ సాదించడమే.
తెలుగులోనే కాదు కేరళలో కూడా ఈ సినిమా భారీ రేంజ్లో రిలీజ్ అవుతుంది.
తారక్ కెరియర్ లో అత్యంత భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా టాక్ బయటకు వచ్చే లోపే వీకెండ్ టికెట్ కౌంటర్ సేల్ అవుతుంది.
ఇక మొదటి రోజు 20 కోట్లు కనుక తెస్తే ఇక మిగతా మూడు రోజుల్లో మరో 30 కోట్లు తీసుకురావడం ఈజీ.సో జనతా గ్యారేజ్ తో ఎన్.టి.ఆర్ వీకెండ్ తోనే 50 కోట్ల కలక్షన్స్ ను టార్గెట్ పెట్టుకున్నాడు.కొరటాల మార్క్ కథా కథనాలతో వస్తున్న జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది.