వైసీపీ టు టీడీపీ జంపింగ్లు, టీడీపీ టు వైసీపీ జంపింగ్లతో ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం ఏ రోజు ఎలా మారుతుందో కూడా ఊహించడం కష్టంగానే ఉంది.సీనియర్ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాలలోను తమిళనాడు లాగానే రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఇక్కడ ఉప ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పెద్ద ఫైటింగే జరుగుతోంది.ఎట్టకేలకు చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఎనౌన్స్ చేయగా ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఎవరు పేరు ఖరారవుతుందన్నది కాస్త ఆసక్తిగానే ఉంది.
ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న పవన్కళ్యాణ్ జనసేన పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్నది రాజకీయంగా చర్చకు వస్తోంది.ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా ? వద్దా ? అన్న అంశంపై ప్రస్తుతం జనసేనలో చర్చలు జరుగుతున్నాయట.
పవన్ ప్రస్తుతం రాజకీయాలకంటే సినిమాల్లోనే బిజీగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో జనసేన నంద్యాలలో పోటీ చేసినా అక్కడ పవన్ ప్రచారం చేసే తీరిక కూడా ఉండేలా లేదు.
ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నంద్యాలలో జనసేన పోటీ చేస్తే పరాజయం తప్పదు.
ఓ పక్క భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్, అసలుగా చూస్తే ఇది వైసీపీ సీటు.
ఈ క్రమంలోనే ఇక్కడ పోటీ చేయడం కన్నా దూరంగానే ఉంటేనే జనసేనకు బెటరేమో.పవన్ కూడా ఇక్కడ తన అభ్యర్థిని దింపే సాహసం చేస్తాడని అనుకోలేం.జనసేన పోటీ చేస్తే ఆ పార్టీ ఓటమి, పరువు పోవడం ఖాయమే.పవన్ ఇక్కడ పోటీ చేయని పక్షంలో వైసీపీకి ఎలాగూ మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు.
ఇస్తే గిస్తే 2014లో టీడీపీకి ఇచ్చిన మద్దతు మాదిరిగానే ఇక్కడా ఇవ్వాలి.లేనిపక్షంలో సైలెంట్గా ఉండాలి.