పవన్ మళ్ళీ ట్వీట్ చేశాడు.ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో బరిలోకి దిగుతాము అనే విషయంలో.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టతనిచ్చారు.తమకు బలం ఉన్న నియోజక వర్గాల్లోనే బరిలో దిగుతామని చెప్పారు.
జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ ప్రకటన చేశారు.మన బలం 175 ఉంటే 175 స్థానాలకే పోటీ చేద్దామని.
, బలం ఎంతుంటే అంత., తెలంగాణ సహా అన్ని చోట్ల పోటీ చేద్దామని., బలం ఎంతో అంతే చేద్దామని చెప్పారు.మరి పొత్తు ఎవరితో ఉంటుంది.ఎలా ఉండబోతుంది .అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు.
ఇక్కడ విషయం ఏమిటి అంటే ఏపీ,తెలంగాణా రెండిటిలో కలిపి పోటీ చేస్తాను అని ప్రకటించాడు అంటే ఏపీలోని అన్ని స్థానాల్లో పవన్ పార్టీ పోటీ చేయబోదన్న మాట.ఏపీలోనే 175 శాసనసభ స్థానాలున్నాయి.అంటే ఎక్కువగా చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లోనే ఎక్కువగా పవన్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి.దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పవన్ పొత్తు పెట్టుకోరని అర్ధమవుతోంది.
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే బరిలోకి దిగుతారని అందరూ భావించారు.తెలుగుదేశం పార్టీ కూడా పవన్ పట్ల సానుకూలంగా ఉంది.
పవన్ లేవనెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తుంది.కాని టీడీపీ ఆశలకు పవన్ గండికొట్టినట్లే కన్పిస్తోంది.
ఎందుకంటే పవన్ పోటీ చేయాలనీ అనుకున్న స్థానాలు అన్నీ కూడా టీడీపికి బలంగా ఉన్నవే.అటువంటప్పుడు పవన్ టీడీపీ మద్దతు ఇస్తారు అనుకోవడం అనుమానమే.
ఇప్పుడు పవన్ ప్రకటనతో షాక్ తిన్న టీడీపీ ఆలోచనలో పడింది అని తెలుస్తోంది.మరి పవన్ రాజకీయం ఎలా ఉండబోతోంది.
బీజేపీతో పవన్ సై అంటాడా.వైసీపి వైపు మొగ్గు చుపుతాడా.
లేక ఇంతకూ ముందులా టీడీపీ కి సపోర్ట్ చేస్తాడ అనేది వేచి
.