ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా “జై లవకుశ” మీద చర్చలే వినిపిస్తున్నాయి.ఈ చిత్రం విడుదలకి మరొక వారం రోజులు సమయం ఉంది కావున ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతోంది.
ఎందుకంటే ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చెయ్యడం, ఒకపాత్రలో విలన్ గా కనిపించనుండడం.ఇప్పటికే రోజుకో సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా మీద విపరీతమైన ఆసక్తిని తెప్పించేశారు.
ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అనేలా చేసేశారు చిత్ర యూనిట్
ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉన్న సమయంలో ఈ స్టోరి ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది.అదేమిటంటే జై, లవ, కుశ లు ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు.
అనుకోని కారణాలతో ముగ్గురు చిన్నప్పుడే విడిపోతారు.ఇక పెద్దయిన ముగ్గురిలో లవ కుమార్ బ్యాంక్ మేనేజర్ గా, భయస్తుడిగా ఉంటాడు.
కానీ కుశ మాత్రం ఎంతో జ్యోవిఎల్ గా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలనే ప్లాన్ తో దొరికిన చోట దొరికినంత దోచుకుంటుంటాడు.ఇక లవ, కుశ లిద్దరూ కలిసే ఉంటారు.
అయితే లవ కుమార్ కి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోగా… లవ లాగా బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలోకి కుశ ఎంటర్ అయ్యి అక్కడ అందరిని కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.మరోవైపు జై కేరెక్టర్ మాత్రం రావణ్ గా, విలన్ గా లవకి కుశ కి ఇద్దరికీ దూరంగా ఉంటాడు.
ఇక జై మాత్రం లవ, కుశ ల మీద పగా ప్రతీకారాలతో రుగులుతూ పొలిటికల్ గా ఎదుగుతాడట.అయితే ‘జై లవ కుశ’లోని రెండు అదిరిపోయే ట్విస్టులతో వీరు ముగ్గురు ఒక్కటవుతారట
ఇది ఇలా ఉంటే ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఈ సినిమాలో ఉందని చిత్ర యూనిట్ చెప్తోంది.
ఈ ట్విస్ట్ ఎవ్వరి ఊహలకి కూడా అందకుండా ఉంటుందట.ఈ ట్విస్ట్ లలో ఉండే మజా తెలుసుకోవాలి అంటే 21 న ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చే వరకు వేచి చుడాల్సిందే అంటున్నారు.