మళ్లీ ఓదార్పు యాత్ర

తెలుగు ప్రజలకు యాత్రలు అనగానే వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ గుర్తుకు వస్తాడు.ఓదార్పు యాత్రకు పెద్ద రికార్డులే ఉన్న విషయం తెల్సిందే.

 Jagan To Restart ‘odarpu Yatra’-TeluguStop.com

రికార్డు స్థాయిలో రోజుల్లో, రికార్డు స్థాయి దూరం యాత్రలు చేసింది జగన్‌ అనే విషయం తెల్సిందే.గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ప్రయత్నించిన జగన్‌ విఫలం అయ్యాడు.

ప్రతిపక్ష పార్టీ నేతగా మిగిలి పోయాడు.దాంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో అయినా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే యాత్రలు ప్రారంభించబోతున్నాడు.

ఈనెల 11న అనంతపురం జిల్లా నుండి జగన్‌ పరామర్శ యాత్ర ప్రారంభం కాబోతున్నట్లుగా వైకాపా నేతలు చెప్పుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి 85 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు.

వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు, రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జగన్‌ ఈ యాత్రను ప్రారంభించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను కూడా ప్రజల దృష్టిలోకి తీసుకు వెళ్లాలని జగన్‌ నిర్ణయించుకున్నాడని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube