వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారారు.ఆయన ఎమ్మెల్యేలు జంప్ అవుతూ ఉన్న తరుణం లో జగన్ వైఖరి ఆసక్తికరంగా మారింది.
ఇంట్లో మనిషి లాగా ఉండే భూమా నాగిరెడ్డి జగన్ కి హ్యాండ్ ఇవ్వడం తో ఇక మిగితా వాళ్ళు పెద్ద లెక్క కాదు జగన్ కి.డిల్లీ నుంచి తిరిగి ఒచ్చిన జగన్ ఎమ్మెల్యే లు వెళ్ళిపోయిన విషయం మీద పోస్ట్ మారటం మొదలు పెట్టారు.సొంత జిల్లా కడప లో ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం ఏంటి అనేది జగన్ కి మింగుడు పాడనీ విషయం.సొంత ఇలాకా పులివెందుల లో అందుబాటు లో ఉన్న ఎమ్మెల్యేలతో జగన్
మాట్లాడారు.
తీవ్రంగా చర్చ జరిగింది కూడా.తాజాగా గుంటూరు – ప్రకాశం – జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల గురించే జగన్ మాట్లాడుతారనేది తెలిసిందే.నాయకులెవరూ పార్టీని వీడొద్దని భవిష్యత్ మనదేనని పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ధైర్యం నూరిపోయనున్నారని సమాచారం.
పైకి వారికి ఎన్ని చెబుతున్నా భూమా లాంటి వారే వెళ్ళిపోగా లేనిది మిగితా వారు వెళ్ళరా అని జగన్ లోలోపల తెగ భయపడుతున్నాడు అంటున్నారు విశ్లేషకులు.