ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విశ్వప్రయత్నాలు చేస్తోన్న వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు ఓ ఫోబియా పట్టుకుందట.ఆ ఫోబియాతో జగన్ నిత్యం టెన్షన్తోనే ఉంటున్నాడట.
ఈ విషయం జగన్ పార్టీకి చెందిన నాయకులే తమ ఇంటర్నల్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.ఏపీలో అధికార టీడీపీ మీద ఇటీవల తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.
ఇది ఎలాగూ తమకు లాభిస్తుందని జగన్తో పాటు వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట.
రాయలసీమ వరకు మంచి నమ్మకంతో ఉన్న జగన్కు కోస్తాలో పవన్ ఫోబియా పట్టుకుందట.
జనసేనాని వల్ల కాపుతో పాటు యువత, ఇతర ప్రధాన సామాజికవర్గాల్లోని పవన్ అభిమానులు సైతం తమకు దూరమవుతారని జగన్ టెన్షన్తో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాజకీయంగా పవన్ ప్రతి కదలికపైనా జగన్ ఆరా తీస్తున్నాడట.
2014 ఎన్నికల్లో పవన్ ఎంట్రీ వల్లే తాము అధికారానికి దూరమయ్యామన్న భావన జగన్తో పాటు వైకాపాలో బలంగా ఉంది.ఆ ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేస్తే పవన్ జనసేన – టీడీపీ + బీజేపీ మధ్య ఓట్లు చీలి వైకాపాకు లాభించేది.
ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్న జగన్కు జనసేన కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట.
ఏపీలో కీలక సమస్యలపై జగన్ కంటే ముందే పవన్ అడ్వాన్స్డ్గా స్పందిస్తున్నారు.
అందుకే జగన్ పవన్ ఎక్కడకు వెళుతున్నారు ? ఏ సమస్యలపై స్పందిస్తున్నారు ? పవన్ను ఎవరెవరు కలుస్తున్నారు ? పవన్ టీంలో కీలకమైన నాయకులు ఎవరు ? అన్న అంశాలపై 24X7 నిఘా ఉంచారట.ఏదేమైనా జగన్కు పవన్ టెన్షన్ ఉన్నట్టే కనిపిస్తోంది.