‘జబర్దస్త్’ బ్యూటీ రష్మి కొన్ని సంవత్సరాల క్రితం వెండి తెరపై మెరిసిన విషయం తెల్సిందే.అయితే లక్ కలిసి రాక వెండి తెరపై ఈమెకు క్రేజ్ దక్కలేదు.
అయితే ఆ తర్వాత ఈమెకు ‘జబర్దస్త్’ ఆఫర్ రావడంతో బుల్లి తెరపై హాట్ హీరోయిన్గా మారిపోయింది.ఈటీవీలో వారంలో దాదాపు ఏడు సార్లు వచ్చే ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఈమె తన అందాలను ఒలకబోస్తూనే, తన ట్యాలెంట్తో ఆ కామెడీ షోను రక్తి కట్టిస్తోంది.
ఇక తాజాగా ఈమెకు వచ్చిన గుర్తింపుతో మరోసారి హీరోయిన్ ఆఫర్ వచ్చింది.
‘చందమామ కథలు’ వంటి జాతీయ అవార్డు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గుంటూరు టాకీస్’ సినిమా తెరకెక్కుతోంది.
ఆ సినిమాలో హీరోయిన్గా ఈమెకు ఆఫర్ దక్కింది.అందులో ఒక పల్లెటూరు అమ్మాయిగా రష్మి కనిపించనుంది.
ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్ సినిమాపై ఆసక్తిని కలుగ జేస్తున్నాయి.ఇక లంగా ఓణిలో ముద్దుగుమ్మ రష్మి మరింత అందంగా కనిపిస్తోంది అంటూ కుర్రకారు అంటున్నారు.
వెండి తెరపై ఒకసారి ఫ్లాప్ అయిన ఈ అమ్మడు రీఎంట్రీతో సక్సెస్ అవుతుందో చూడాలి.