పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది.ఉదయాన్నే కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేసారు.
అక్కడ మహేష్, ఎన్టీఆర్ కి కూడా బెనిఫిట్ షోలు పడతాయి.అయితే కాటమరాయుడు సినిమా టికెట్ల కోసం మాత్రం కాస్త వేడి ఎక్కువగా ఉంది.
ఇదంతా పవన్ చరిష్మ అంటూ పవర్ స్టార్ అభిమానులు జబ్బలు చరుచుకుంటుంటే, అంత సీన్ లేదు అంటూ తమిళ స్టార్ అజిత్ ఫ్యాన్స్,కాటమరాయుడుని తమిళనాట పంపిణి చేస్తున్న బయ్యర్ పవన్ తో పాటు పవన్ ఫ్యాన్స్ గాలి తీసేశారు.ఇక ఈ సినిమాకి అజిత్ ఫ్యాన్స్ కి ఏంటి సంబంధం అని అనుకుంటే, మీకు సినిమా నాలెడ్జి బొత్తిగా లేన్నట్టే.
కాటమరాయుడు అజిత్ నటించిన వీరమ్ అనే చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.వీరమ్ సినిమా అంటే అజిత్ ఫ్యాన్స్ కి ప్రత్యేక మమకారం ఉంది.
పైగా, ఈ మధ్యకాలంలో రిమేక్ అవుతున్న అజిత్ సినిమా అదే.అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి అగ్రహీరో రీమేక్ చేస్తున్నాడు.అందుకే అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.సొంత సినిమాలా ఫీల్ అవుతున్నారు.అన్ని ఏర్పాట్లు చేస్తున్నది మేమే, దీన్ని పట్టుకొని పవన్ ఫ్యాన్స్ హంగామా చేసే ముందు, ఒక్కసారి పవన్ గత సినిమాలు తమిళనాడులో ఎలా ఆడాయో గుర్తుతెచ్చుకోండి అంటూ సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతోంటే, కాటమరాయుడు చిత్రాన్ని తమిళనాడులో పంపిణి చేస్తున్న నరెంద్రన్ (నాగా ఫిలింస్) అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది నిజమే అని తేల్చాడు.
“ఇదంతా అజిత్ సార్ ఫ్యాన్స్ వలనే జరుగుతోంది.వాళ్ళే ముఖ్య కారణం.ఇది వీరమ్ రిమేక్ కావడంతో అజిత్ ఫ్యాన్స్ దీనికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.సినిమాని వాళ్ళు ప్రమోట్ కూడా చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సార్ కి ఇక్కడ ఫాలోయింగ్ ఉంది.
ఈసారి అజిత్ ఫ్యాన్స్ తోడవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.టాక్ బాగుంటే కొన్నివారాల పాటు కాటమరాయుడు సందడి చేయవచ్చు” అంటూ ఓ తమిళ సినిమా మీడియా సెక్షన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఈ బయ్యర్.