అగ్నిపర్వతంలా పేలుతారు

అగ్ని పర్వతంలా పేలడమంటే బీభత్సం సృష్టించడమే కదా…! ఎవరు వీరు? ఎందుకు పేలతారు? వీరు రామ భక్తులు.అయోధ్యలో ప్రభుత్వం రామ మందిరం నిర్మించకపోతే వీరు అగ్నిపర్వతంలా పేలుతారట…! ఇది స్టేమెంట్‌లా కనబడుతున్నా ప్రభుత్వానికి హెచ్చరిక అనుకోవచ్చు.

 It Is Time Govt Constructs Ram Temple-TeluguStop.com

ఇలా హెచ్చరించిన వ్యక్తి భాజపా రాజ్యసభ సభ్యుడు వినయ్‌ కతియార్‌.రామమందిరాన్ని ఏ ప్రభుత్వమూ విస్మరించలేదన్నారు.

రామ మందిర నిర్మాణం పెద్ద సమస్య కాదని, అన్ని పార్టీలను కూర్చోపెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయమన్నారు.

భాజపాకు రామమందిరం ఎప్పుడూ ఒక ఆయుధంగానే ఉంది.ఈ మందిరం నిర్మించడం అంత సులభం కాదని భాజపా నాయకులకు తెలుసు.

అయినా దీన్ని గురించి ప్రస్తావించకుండా ఉండదు.దీన్ని వదిలేస్తే హిందువులు దూరం అవుతారనే భయం ఉంది.

అలాగని ముస్లింలనూ దూరం చేసుకోలేరు.వినయ్‌ కతియార్‌ రామ మందిరంపై ప్రకటన చేయగానే ముస్లిం నాయకులు మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube