పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న డాలి సినిమా పూర్తి కాగానే త్రివిక్రంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.త్రివిక్రం ఇప్పటికే సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాడట.
అయితే ఫిలింనగర్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడట.ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి గోపాలా గోపాల సినిమాలో నటించారు.
డాలి డైరెక్ట్ చేసిన ఆ సినిమా అటు దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్ అందించింది.
ఇప్పుడు అదే మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ కానుందట.
సాధారణంగా మల్టీస్టారర్స్ కు సపోర్ట్ ఇచ్చే వెంకటేష్ పవన్ తో మరోసారి నటించేందుకు సుముఖంగానే ఉన్నారట.ఇక తను రైటర్ గా ఉన్నప్పటి నుండి త్రివిక్రం వెంకటేష్ టైమింగ్ కు వీరాభిమాని.
సో అలా అన్ని కలిసి వచ్చి వెంకటేష్ ను కూడా పవన్ సినిమాలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నాడట త్రివిక్రం శ్రీనివాస్.మరి ఈ క్రేజ్ కాంబోలో మాటల మాంత్రికుడు చేయబోతున్న మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
వెంకటేష్ నటించిన బాబు బంగారం సినిమా ఈ వారాంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది.మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.