మొన్న సాయంత్రం మీడియా లో పవన్ కళ్యాణ్ – బీవీఎస్ యెన్ ప్రసాద్ మీద కేసు పెట్టారు అనీ న్యూస్ రావడంతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది.నాన్నకు ప్రేమతో సినిమా విడుదల కి ముందరే కళ్యాణ్ ఇలా చెయ్యడంతో జనాలు తీవ్రంగా స్పందించారు.
నిజానికి పవన్ ఫిర్యాదు చేసాడు తప్ప కేసు పెట్టలేదు.
పవన్ కళ్యాణ్ తనకు రెండు కోట్లు నాన్నకు ప్రేమతో నిర్మాత ఇవ్వాలని మా అసోసియేషన్ కు రాసిన లేఖ నిన్నటికి నిన్న ఉవ్వెత్తున ఎగసి చప్పున చల్లారిపోయింది.
అయితే ఈ హడావుడి ఎలా రేగింది? ఎవరు రాజేసారు? అన్న అనుమానాలు మాత్రం ఇండస్ట్రీలో మిగిలిపోయాయి.ఎందుకంటే పవన్ ఈ లేఖను చాలా గుట్టుచప్పుడు కాకుండా పంపించినట్లు వినికిడి.
కానీ అది మీడియాకి లీక్ అయ్యింది.పక్కన ఉన్న వారు ఎవరో కళ్యాణ్ ఆ విషయం మర్చిపోయినా కూడా ఈ మేరకు నిర్మాతకి ఫోన్ చేయించారు అని తెలుస్తోంది.
పవన్ కు పక్కనున్నవాళ్లు, సరైన సమాధానం రాలేదు కనుక అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్దామంటే, ఆయన ఊ అన్నట్లు వినికిడి.వెంటనే పవన్ మనుషులు ఫర్ సంతకం చేసి కామ్ గా లెటర్ ఇచ్చారు.
ఇంత షార్ట్ పిరియడ్ లో కుదరదని చాంబర్ చెప్పేసింది ఆ వెంటనే.కానీ అప్పటి కప్పుడు పవన్ లేఖ విషయం బయటకు పొక్కింది.
అది ఏ రేంజ్ లో పొక్కింది అంటే, నాన్నకు ప్రేమతో సినిమా ఆగిపోతుందన్న రేంజ్ లో.