సూపర్ స్టార్ మహేష్బాబు మరియు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఆ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఈ కాంబినేషన్కు తెలుగు మరియు తమిళంలో భారీ క్రేజ్ ఉంది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
ఈ చిత్రంలో భారత న్యాయ వ్యవస్థలోని లోపాలను దర్శకుడు మురుగదాస్ ఎత్తి చూపించనున్నట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రానికి మొదట ‘చట్టంతో పోరాటం’, ‘నేను సైతం’ టైటిల్స్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే అవేవి కావు అంటూ మహేష్బాబు సన్నిహితులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ చిత్రానికి మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.
ఈ చిత్రం కోసం ‘విలన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.గతంలో మహేష్బాబు నెగటివ్ టైటిల్ ‘పోకిరి’తో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
మళ్లీ ఇప్పుడు నెగటివ్ టైటిల్తో మహేష్బాబు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్న మహేష్బాబు అది పూర్తి అయిన తర్వాత ఈ ‘విలన్’లో నటించబోతున్నాడు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఠాగూర్ మధు మరియు ఎన్వీ ప్రసాద్లు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.