యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల అయిన వెంటనే ఒక చిన్న చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతోంది.
‘బాహుబలి’ రెండవ పార్ట్ కోసం ప్రభాస్ కసరత్తులు ప్రారంభించాడు.దాంతో మరో సినిమాకు ప్రస్తుతం ఆస్కారం లేదు.
ప్రభాస్ నుండి కొత్త సినిమా అంటే ‘బాహుబలి’ రెండవ పార్ట్ విడుదల అయిన తర్వాతే అని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు తన సొంత బ్యానర్లో ‘దందా’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడు.
చాలా కాలంగా కృష్ణం రాజు దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకులు ఒక సినిమాను కోరుకుంటున్నాడు.ఆ మధ్య ‘ఒక్క అడుగు’ అనే టైటిల్తో వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.
కాని అది కార్య రూపం దాల్చలేదు.తాజాగా కృష్ణం రాజు ‘దందా’ అనే టైటిల్ను ప్రభాస్ కోసం రిజిస్ట్రర్ చేయించడం జరిగింది.
త్వరలోనే కృష్ణం రాజు స్వయంగా ఆ టైటిల్ వెనుక ఉన్న అసలు కథను తెలిపే అవకాశాలు ఉన్నాయి.‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలు చేయాలని భావించుకున్నాడు.అందులో భాగంగానే సుజీత్ దర్శకత్వంలో సినిమాతో పాటే కృష్ణంరాజు దర్శకత్వంలో కూడా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.2017లో ప్రభాస్ ‘దందా’ చేసే అవకాశాలున్నాయి.ఈ టైటిల్తో ప్రభాస్ సినిమా చేస్తే మాస్ దుమ్ము లేచిపోవడం ఖాయం అంటూ మాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు.