పవన్‌కు నో చెప్పి, చరణ్‌కు ఓకే చెప్పింది

బుల్లి తెర హాట్‌ యాంకర్‌ అనసూయ వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతోంది.గతంలో ఈ అమ్మడికి పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం దక్కింది.

 Is Anasuya Doing Item Song For Her Next ?-TeluguStop.com

కాని కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ సినిమాలో నటించేందుకు అనసూయ నో చెప్పింది.ఆ తర్వాత ఈమెపై పలువురు విమర్శలు చేశారు.

ఆ సినిమాను చేయనందుకు అనసూయ ఇప్పటికి కూడా బాధపడుతున్నట్లుగా ఆమె మాటల ద్వారా అర్థం అవుతోంది.ఇక ఈ అమ్మడు తాజాగా సోగ్గాడితో కలిసి చిందేసి, ‘క్షణం’ చిత్రంలో ముఖ్య పాత్రలో ఈ అమ్మడు కనిపించింది.

తాజాగా ఈమెకు మెగా ఆఫర్‌ దక్కినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యింది.ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రకు అనసూయను ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

భారీ అంచనాలున్న ఈ సినిమాలో అనసూయకు అవకాశం దక్కడంతో ఎగిరి గంతేసినంత పని చేస్తోంది.ఈ చిత్రంలో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు, ఒక ఐటెం సాంగ్‌ను సైతం ఈ అమ్మడు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube