బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతోంది.గతంలో ఈ అమ్మడికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది.
కాని కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ సినిమాలో నటించేందుకు అనసూయ నో చెప్పింది.ఆ తర్వాత ఈమెపై పలువురు విమర్శలు చేశారు.
ఆ సినిమాను చేయనందుకు అనసూయ ఇప్పటికి కూడా బాధపడుతున్నట్లుగా ఆమె మాటల ద్వారా అర్థం అవుతోంది.ఇక ఈ అమ్మడు తాజాగా సోగ్గాడితో కలిసి చిందేసి, ‘క్షణం’ చిత్రంలో ముఖ్య పాత్రలో ఈ అమ్మడు కనిపించింది.
తాజాగా ఈమెకు మెగా ఆఫర్ దక్కినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయ్యింది.ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రకు అనసూయను ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో అనసూయకు అవకాశం దక్కడంతో ఎగిరి గంతేసినంత పని చేస్తోంది.ఈ చిత్రంలో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు, ఒక ఐటెం సాంగ్ను సైతం ఈ అమ్మడు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.