ఈ సీజన్ ఐపీఎల్ లో ఎక్కువగా భారీ స్కోర్లు నమోదు కావడం లేదు.ఇప్పటివరకు 14 మ్యాచ్ లు జరుగగా కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే భారీ స్కోర్లు నమోదయ్యాయి.అందులో మూడు మ్యాచ్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మ్యాచ్ లు కావడమే విశేషం.అయితే ఈ ఐపీఎల్ సీజన్లో విజయం దక్కించుకోవాలంటే రహస్యమేంటో జట్లకు తెలిసిపోయింది.
ముంబై – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ తో కలిపి 14 మ్యాచ్ లు ఆడగా, 13 మ్యాచ్ లలో చేజింగ్ జట్టు లక్ష్యాన్ని అందుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాయి.మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ కూడా బెంగుళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 200పై చిలుకు పరుగులు చేయడంతో విజయం వశమైంది.
అంటే ఈ సీజన్లో విజయం దక్కించుకోవాలంటే తొలుత బ్యాటింగ్ చేస్తే… 200 పరుగులు దాటాలి… లేదంటే లక్ష్యాన్ని చేధించాలి.మరో విశేషమేమిటంటే… భారీ లక్ష్యాలు కూడా అవలీలగా అందుకున్నారు.
బెంగుళూరు అందించిన 191, 171 పరుగుల లక్ష్యాలను ప్రత్యర్ధి జట్లు అవలీలగా అందుకోవడం చూస్తుంటే… ఏ జట్టైనా టాస్ గెలవగానే మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా బౌలింగ్ ఎంచుకుంటుందని చెప్పవచ్చు.అంటే టాస్ గెలిస్తే… దాదాపు మ్యాచ్ గెలిచినట్టే.
ఇప్పటివరకు అయితే ఇదే ట్రెండ్ కొనసాగుతోంది… మరి ఈ ట్రెండ్ ను ఏ జట్టు మారుస్తుందో చూడాలి.