అనంతపురం జిల్లా లో పాగుతున్న వైకాపా అధినేత జగన్ రోడ్ షో కు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు.తెలుగుదేశం కార్యకర్తలు ఇటీవల అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశం నేతలు, మండి పడుతున్న ్రకమంలో ఆదే వ్యాఖ్యలను పదే పదే చేస్తూ ముందుకు సాగుతున్న జగన్, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
నిన్న యాడికిలో కార్యకర్తల సమావేశంలోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తూ, చంద్రబాబు ఆటంకాలు కలిపించాలని తన పార్టీ నేతలకు సూచనలిచ్చారని ఆరోపించారని సమాచారం.ఈ సమావేశాన్ని సైతం తెలుగు తమ్ముళ్లు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను వైకాపా కార్యకర్తలు అడ్డు కున్నారు.
కాగా శనివారం తిరిగి కదిరి, అంబేడ్కర్ సెంటర్ వద్ద లో జగన్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్ షోను అడ్డుకున్నారు.దీంతో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన తోపులాట తీవ్ర ఘర్షణ కు దారి తీసింది.
ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా జరిగింది.పరస్పరం చెప్పులు విసురుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పి ఘర్షణకు దిగిన తెలుగేదశం, వైకాపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
ఓ వైపు ఈ ఘర్షణ జరుగుతుండగానే జగన్ తన ప్రచార వాహనం దిగి కాన్వాయ్ లో ముందుకు సాగిపోవటం కనిపించింది.
మరో వైపు అనంతలోనే జగన్ క్షమాపణ చేప్పేవరకు నిలువరించేలా దేశం నేతలు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.