నిన్నటి వరకు ఆయన ఒక స్టార్ హీరో.దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఒక సూపర్ స్టార్.
కాని నేడు ఆయన ఒక జీరో అయ్యాడు.ఆయన మాట్లాడిన మాటలు ఆయన్ను జీరో చేశాయి.
ఆయన మరెవ్వరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.దేశం తనకు ఏమీ ఇచ్చింది అని కాదు, దేశానికి తాను ఏం ఇచ్చాను అని అనుకున్నవాడే గొప్ప దేశ భక్తుడు అవుతాడు.
కాని ఈ హీరోగారు మాత్రం దేశం తనకు భయాన్ని ఇచ్చిందని, దేశంలో ఉండాలంటే భయం వేస్తుంది అంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడాడు.దాంతో ఈయనపై భారతీయులు అంతా కూడా అసహ్యంను పెంచుకున్నారు.
ఒక్క రోజులోనే అమీర్ ఖాన్పై ఉన్న అభిమానం కాస్త అసహ్యంగా మారి పోయింది.ఈయన చేసిన ఎన్నో గొప్ప పాత్రల ద్వారా అభిమానును సాదించుకున్నాడు.
అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశానికి మచ్చ తెచ్చేవిగా ఉన్నాయని ప్రముఖులు అంటున్నారు.సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు, ఆయనకు సన్నిహితంగా మెలిగే వారు, ఆయన్ను అభిమానించే వారు అంతా కూడా ఇప్పుడు అమీర్ను ద్వేషిస్తున్నారు.
ఇప్పటికి అయినా అమీర్ ఖాన్ తాను అన్న మాటలను వెనక్కు తీసుకుని, దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా హిందుత్వ వాదులు మరియు ఇతర మతాల ప్రజు సైతం డిమాండ్ చేస్తున్నారు.భవిష్యత్తులో అమీర్ ఖాన్ నటించబోతున్న సినిమాలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
దాంతో ఈయనకు హీరోగా కూడా క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంది.మొత్తానికి అమీర్ ఖాన్ ఇప్పుడు జీరో అయ్యాడు.