వారిది ఒక మాధవ్ పురలో ఒక స్వర్ణకారుల కుటుంబం.ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు.25 ఏళ్ళ కొడుకు శ్యాం చదువు పూర్తిచేసుకోని తమ కులంపనే చేసుకుంటున్నాడు.అనుకోకుండా అతను తప్పిపోయాడు, నిజానికైతే పారిపోయాడు.
ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.దాంతో తల్లిందండ్రులు పోలీసులని ఆశ్రయించారు.
తప్పిపోయిన తన కోడుకుని వేతికిపెట్టమని వేడుకున్నారు.
వారంలో పోలీసులు ఫోన్ చేసారు.
తమ కొడుకు ఆచూకి గురించే చెబుతారేమో అని ఆశ.వారి ఆశ అడియాశ కాలేదు.పోలీసులు ఫోన్ చేసి శ్యాం దొరికాడని కాదు, దొరికింది అని చెప్పారు.మొదట తల్లిందండ్రులకి అర్థం కాలేదు.ఆ తరువాత పోలీసులు వివరంగా చెప్పారు, తప్పిపోయిన మీ కొడుకు ఇప్పుడు కొడుకు కాదు కూతురు అని, లింగమార్పిడి చేసుకున్నాడని.తల్లిందండ్రులు, మరో కూతురు షాక్ కి గురయ్యారు.పాతికేళ్ళ శ్యాం గతకొన్ని సంవత్సరాలుగా తనని తాను అమ్మాయిలానే చూస్తున్నాడట.లింగమార్పిడి చేయించుకుంటానని తల్లిందండ్రులను ఒప్పించే ప్రయత్నాలు చాలానే చేసాడట.కాని పరువు గురించి ఆలోచించి వారు తన మాట కాదన్నారు.దాంతో గత ఏడాదికాలంగా శ్యాం తన శరీరాన్ని లింగమార్పిడికి సిద్ధం చేసుకుంటూ వచ్చాడు.
హార్మోన్ థెరపి కూడా మొదలుపెట్టాడు.సమయం దగ్గరపడేసరికి ఇంట్లో చెప్పకుండా పారిపోయి, లింగమార్పిడి చేసుకోని స్త్రీగా మారిపోయాడు.
అతని ఆచూకీ కోసం గాలించిన పోలీసులు, అతని మొబైల్ ద్వారా అతడ్ని ట్రేస్ అయితే చేసారు కాని, అప్పటికే శ్యాం తన ఇష్టప్రకారంగా అమ్మాయిగా మారిపోయాడు.తన మాటను విస్మరించారనేమో, ఆచూకి తెలిసాక హాస్పిటల్ కి వచ్చిన కుటుంబసభ్యులును కలవడానికి నిరాకరించాడు.