తెలుగు ప్రేక్షకులకు చిన్నప్పుడే ‘సిసింద్రీ’గా పరిచయం అయిన అక్కినేని ఫ్యామిలీ యువరాజు అఖిల్ హీరోగా మొదటి సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.అఖిల్ మొదటి సినిమాను నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు అయినా వినాయక్ చేతుల్లో పెట్టడం జరిగింది.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాలో అన్ని కూడా హైలైట్గా ఉండేలా దర్శకుడు వినాయక్ ప్లాన్ చేస్తున్నాడు.బడ్జెట్కు ఏమాత్రం నెరవకుండా ఈ సినిమాను యువ హీరో నితిన్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఇక ఈ సినిమా గురించిన ఒక ముఖ్యమైన వార్త ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.గతంలో ఈ సినిమాలో రాశి ఖన్నా ఐటెం సాంగ్ చేయనుందని ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తలు పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ను ఇలియానాతో చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే నిర్మాత నితిన్ మరియు దర్శకుడు వినాయక్ ఆమెతో చర్చలు జరిపారని తెలుస్తోంది.బాలీవుడ్లో పెద్దగా ఆఫర్లు లేని ఇలియానా ఐటెం సాంగ్స్కు ఓకే చెప్పింది.
అఖిల్ సినిమాలో ఇలియానా ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో సాహేస సైగల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.