ఒకప్పుడు హైదరాబాద్ లేని తెలంగాణా మాకు వద్దు.హైదరాబాద్ తో కూడిన తెలంగాణా నే మాకు కావాలి అంటూ హైదరాబాద్ కోసం ఉధ్యమాలు, దర్నాలు.
బంధ్ లు, రాస్తారోకోలు చేసిన సాక్షాత్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే హైదరాబాద్ గురించి చాలా హీనంగా మాట్లాడారు.వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ ఓ పిచ్చినగరం.
ఇదొక నగరమా.ఇది మనుషులు ఉండే నగరమేనా.
వర్షం కురిస్తే.సీఎం ఇంటి ముందే నీళ్లు ఏరులై పారతై.
ఇంకా గట్టిగా వాన పడితే.గవర్నర్ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు.
వర్షం వస్తే.వందల కుటుంబాలు జలమయం అవుతాయ్.
నేలపై నడవాల్సిన కార్లు.పడవలై తేలుతుంటాయ్.
మీరు టీవీలల్ల చూస్తనే ఉంటరు.ఇలా హైదరాబాద్ మైనస్ పాయింట్లు ఏకరువు పెట్టారు కేసీఆర్.
అయితే ఇదంతా హైదరాబాద్ పై కోపం కాదనుకోండి.దీన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు కేసీఆర్…ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ ను హైటెక్ సిటీ చేశామని కొందరు అంటుంటారు.
ఇదా హైటెక్ సిటీ.ఇది హైటెక్ సిటీ కాదు.
లోటెక్ సిటీ అని.పరోక్షంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.హైదరాబాద్ అంటే ప్రేమలేని గతకాలం నేతలు.ఈ నగరానికి చేసిందేమీలేదని ఎక్కడో మొదలు పెట్టి ఇంకెక్కడో ముగించారు.ఇక అదే క్రమంలో తమ గొప్పతనాన్ని సైతం ప్రజలకు తెలియజేశారు….హైదరాబాద్ ను అసలైన స్మార్ట్ సిటీగా తాము చేసి చూపిస్తామని, హైదరాబాద్ నగర స్వరూపాన్ని సమూలంగా మారుస్తామని, చాలా ప్రాంతాల్లో భూములు సేకరించి.
మౌలిక సదుపాయాల కల్పన కు పెద్దపీట వేస్తామని ఏవేవో వరాలు కురిపించారు.ఇంతవరకు ఎలా ఉన్నా.
పాపం ఇవన్ని మంత్రాగాడి మాటల్లా ఉన్నాయి అంటున్నారు టీడీపీ నేతలు.