సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా శ్రీమంతుడు.భారి సక్సెస్ ని సొంతం చేసుకోని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండగానే ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది.
శరత్ చంద్ర అనే రచయిత శ్రీమంతుడు కథని తన నవల “చచ్చేంత ప్రేమ” నుంచి కాపి కొట్టారని సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకి తెలిసిందే.
తాను ఈ కథను సొంతంగా రాసుకున్నానని, ఎక్కడినుంచి కాపి కొట్టలేదని కొరటాల నుంచి సమాధనం వచ్చినప్పటికీ , ఈ విషయాన్ని కోర్టుకి తీసుకెళ్ళాడు శరత్ చంద్ర.
ఇన్నాళ్ళకి ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
హైదరాబద్ సివిల్ కోర్టు శరత్ చంద్ర వేసిన కేసుని పరిగణలోకి తీసుకుంది.
శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, మైత్రి మూవి మేకర్స్ తో పాటు ఈ చిత్రాన్ని హిందిలో రీమేక్ చేయాలనుకున్న హృతిక్ రోషన్ కి కోర్టు నోటిసులు పంపించింది.తదుపరి విచారణ మార్చి 4వ తేదిన జరుగనున్నట్లు సమాచారం.