వివాదాల కామెడి షో, జబర్దస్త్ మరో వివాదంలో చిక్కుకుంది.ఒక్కోసారి హద్దులు దాటిన కామెడితో భిన్న వర్గాల మనోభావాలను దెబ్బతీసిన ఈ కామెడి షో, ఈసారి లాయర్ల సెంటిమెంట్లను హర్ట్ చేసింది.
లాయర్లను కించపరిచే విధంగా జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్లు ఉంటున్నాయని, హుజురాబాద్ లాయర్ల సంఘం కోర్టుకెక్కంది.హుజురాబాద్ సబ్ కోర్టులో, జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జులు రోజా, నాగాబాబులతో పాటు నిర్మాణ సంస్థ మల్లేమాల ప్రొడక్షన్స్ పై కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా జబర్దస్త్ నిర్మాతలు ఇప్పటికే కోర్టులో హాజరయ్యారని సమాచారం.ఈ షో మీద చాలా వివాదలు ఉన్నా, వస్తున్న టీఆర్పీని దృష్టిలో పెట్టుకోని ఈటివి పెద్దగా పట్టించుకోవట్లేదు.