కుమారీ 21 ఎఫ్ లో హేబా పటేల్ కి బాగా పేరొచ్చింది, ఎంతగా అంటే హీరో రాజ్ తరుణ్ ని ఆమె పాత్ర చాలా చోట్ల డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి ఆఫర్లు వరసగా వస్తున్నాయి.
ఇప్పటికే జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో రాజ్ తరుణ్ తో మరోసారి జత కడుతోంది.ఇది మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో.మోహన్ లాల్-గౌతమి నటిస్తున్న సినిమాలోనూ హేభా యాక్ట్ చేస్తోంది.సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి పలు భాషల్లో రూపు దిద్దుకోనుంది.
శర్వానంద్ పక్కన కూడా ఈమె దాదాపుగా ఓకే అయినట్టు తెలుస్తోంది.మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి కూడా హేబా సంతకం పెట్టనుంది అంటున్నారు.