టెక్నికల్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఐ” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కలక్షన్స్ మాట పక్కన పెడితే, వాటికన్నా వివాదాలు ఎక్కువయ్యాయి అన్న వాదన బలంగా వినపడుతుంది.
అసలేం జరిగింది అంటే ‘ఐ’ సినిమాలో ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చూపించడం అనేది తమ మనోభావాలను దెబ్బ తీసేది గాఉంది అని ఈ చిత్రానికి వ్యతిరేకంగా హిజ్రాలు (ట్రాన్స్ జెండర్స్) ఆందోళనకు సిద్ధమయ్యారు అనే వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగానే హిజ్రాలు దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడానికి సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోలీవుడ్ లో యావరేజ్ టాక్ వచ్చినా ఇప్పటివరకు కలెక్షన్స్ బాగానే ఉండటంతో ‘ఐ’ పరిస్థితి టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లో కొంచం మేరుగుగానే ఉంది అని సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం.మరి ఇప్పటికే సినిమాపోయి నానా ఇబ్బందులు పడుతున్న ఐ టీమ్ కు ఈ వివాదాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆనందంలో ఏ మాత్రం సందేహం లేదు.